తులసిదళం నవల ద్వారా సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవ సంబంధాలని అత్యుద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా వుంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలు ఈ పుస్తకంలో వున్నాయి. ప్రతి గ్రంథాలయంలోను వుండాల్సిన పుస్తకం ఈ నవల.
- -- ఇండియా టుడే
యండమూరి రచనా జీవితంలో ఈ పుస్తకం అత్యుత్తమ మైనదని ఆయన ప్రకటించడం అతిశయోక్తి కాదు.
- -- ఈనాడు.
ప్రతి పేజీలోనూ గొప్ప వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలోను గొప్ప గొప్ప భావాలున్నాయి. ప్రతి భాపు పాఠకుడి గుండెను కదిలిస్తుంది. "నేను వయస్సులో వృద్ధ శవాన్ని జ్ఞానంతో శైశవాన్ని" లాంటి గొప్ప భావాలు ఎన్నో...
- -- ఆంధ్రజ్యోతి