జగద్గురు
కంచి పరమాచార్య
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి
(1894 మే 20 - 1994 జనవరి 8)
కంచి కామకోటి పీఠానికి 68 వ పీఠాధిపతి. 1907 నుండి 1994 వరకు పీఠాధిపత్యం వహించారు. పరమాచార్య, మహాస్వమి, మహా పెరియవర్గా ప్రసిద్ధులు. ఇటీవలికాలంలో భారతదేశంలో అతి గొప్ప సాధుపురుషుడుగా ప్రఖ్యాతి గడించి సర్వజన గౌరవాన్ని పొందిన మహావ్యక్తి. సన్న్యాసాన్ని అతి నియమనిష్ఠలతో పాటించి, వేదాలను, హందూ ధర్మాన్ని పరిరక్షించడమే ఏకైక ధ్యేయంగా కృషిచేసిన పరమాచార్య స్వామి బహుశాస్త్ర కోవిదులు. ఆయన అసంఖ్యాక ప్రసంగాలు చేశారు. ఇవి సుమారు 6 వేల పుటల్లో ఆంగ్లంలోనికి అనువదితమై ప్రచురితమయ్యాయి. వైదిక ధర్మం గురించి, హిందువుల ఆచార వ్యవహారాల గురించి, సమాజసేవ గురించి, మన కర్తవ్యాల గురించి ఆయన చెప్పిన వాక్కులు ఆదరణీయాలు, అనుసరణీయాలు.
కంచి మహాచార్య అమృతవాణి 1 - 10లో
అమృతవాణి - 1 : అద్వైతం
అమృతవాణి - 2 : నమో నమ:
అమృతవాణి - 3 : షట్పదీస్తోత్రం
అమృతవాణి - 4 : సనాతనధర్మంలో సంఘసేవ
అమృతవాణి - 5 : గణపతి
అమృతవాణి - 6 : సాక్షి పరమాత్మ
అమృతవాణి - 7 : శంకర విజయం
అమృతవాణి - 8 : అద్వైతసాధన
అమృతవాణి - 9 : గురుసంప్రదాయం
అమృతవాణి - 10 : గోసంరక్షణ