మహా వేధ చివుకుల పురుషోత్తం ''సర్వేగుణా కాంచన మాశ్రయంతి'' అన్నది ఆర్యోక్తి. వేమన రసవాదంలో 'పరుసవేది' ప్రభావం మీద నమ్మకం కలిగి ఆ నమ్మకాన్ని అనేక విధాలుగా చాటి చెప్పాడు. మన పూర్వులూ 'పరుసవేది' వుందనీ, బంగారం చేయటం మహాత్ములకు సాధ్యమనీ సంపూర్ణంగా విశ్వసించే వాళ్ళు. శ్రీపతి, ఆ విశ్వాసంతోనే తన యావజ్జీవితం అహోరాత్రాలు శ్రమించి గుప్తవిద్య అయిన హేమసిద్ధిని సాధించడంలో ఇటు అయిన వాళ్ళకీ, అటు పరాయివాళ్ళకీ ఎలా కాకుండా పోతాడో సుప్రసిద్ధ నవలా కారుడు, 'మూడో పురుషార్థం', 'ఏదిపాపం?' నవలల రచయిత అయిన శ్రీ చివుకుల పురుషోత్తం తన సునిశిత పరిశోధనా మేధాసంపత్తిని జోడించి రచించిన తిరుగులేని సుప్రసిద్ధ నవలా రాజం 'మహా వేధ'. పేజీలు : 277