పర్యావరణ పరిరక్షణలో ప్రధానపాత్ర నేటి బాలలదే!
ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానమైనది పర్యావరణ కాలుష్యం. మేధావులు నుండి సామాన్యుల వరకు ఈనాడు అందరూ ఇదే సమస్య గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం గ్లోబల్ వార్మింగ్ గురించి అన్ని దేశాలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. గతంలో ఎలా వున్నా వర్తమానంలో జాగ్రత్తపడకపోతే మానవాళికి భవిష్యత్తే ఉండదని పర్యావరణ శాస్త్రవేత్తలు నొక్కి నొక్కి చెప్తున్నారు. దీనికి ప్రపంచదేశాలు అన్నీ సమర్థిస్తూ ఉమ్మడిగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
దీనిలో భాగంగా రేపటి పౌరులైన నేటి బాలల్ని కేంద్రంగా చేసుకుని వారిలో చైతన్యాన్ని తెస్తే పర్యావరణ పరిరక్షణ ఒక పరిపూర్ణతతో జరుగుతుందని భావించి అందుకోసం పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. ఈ నేపధ్యంలో రూపొందించిన పుస్తకం 'పర్యావరణం - పరిశుభ్రత'లో పర్యావరణం అంటే ఏమిటి? దీని పరిరక్షణ అవసరం ఏమిటి? వాయు కాలుష్యం, జలకాలుష్యం, ధ్వనికాలుష్యం, అణుకాలుష్యం ఎలా జరుగుతోంది? వాటి నేటి స్థాయి ఎలా ఉంది? దాని దుష్పరిణామాలు ఏమిటి? రేపటి దేశ భవిష్యత్తు ఏమిటి? పరిష్కారాలేమిటి? అనేవి సులభశైలిలో, అందరి పిల్లలకు అర్థమయ్యేరీతులలో వివరించాను. - డా. టి.ఎస్.రావు
Pages : 128