ALL CATEGORIES

'ఇది చాలా ముఖ్యమైన పుస్తకం. భారత వ్యతిరేక శక్తులు రాజకీయ, ఇంకా ముఖ్యంగా మేధాస్థాయిలో ఎలా తమ పట్టు బిగించాయో భారతదేశాన్ని గురించి అధ్యయనం చేయడమే వ్యత్తిగా కలవారు కూడా గుర్తించని సమస్యను ఈ పుస్తకం స్పష్టంగా మన ముందు పెడుతుంది. ఎడ్వర్డ్ సయీద్ పుస్తకం ముస్లిం ప్రపంచం విషయంలో చేసిన పనినే ఈ పుస్తకం భారతదేశ విషయంలో చేసింది. అయితే భారతదేశాన్ని పరిశీలిస్తున్న ప్రముఖులు ఈ పుస్తకం చెప్పే విషయాలను నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ పుస్తకం వాళ్ల నిర్వకాల్నే బయటపెడుతుంది'. - కొన్రాడ్ ఎల్ట్స్, బెల్జియన్ విద్వాంసుడు 'సరిగా ఆలోచించే వ్యక్తులు మన చరిత్రను, సంస్కృతిక భావనలను, సరైన మార్గంలో పెట్టవలసిన సమయం ఇది. ముఖ్యంగా దక్షిణభారతీయుల విషయంలో ఇది మరింత ఆవశ్యకం. ఎందుకంటే చాలావరకు నష్టం కలిగిస్తున్నదదే. లౌకికవాదం పేరిట దేశాన్ని అవమానిస్తున్న వాళ్ళే ఇప్పుడు తమను తాము బయట పెట్టుకుంటున్నారు. నేనేమి రాజకీయాల్లో ప్రేవేశిoచడం లేదు. కానీ ఇటీవల రాజకీయ ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు హిందూమతాన్ని, హిందూ ఆలోచనలను, హిందూ భావనలను, హిందూ ధర్మాన్ని విమర్శించేవారి నిజాయితీ రాహిత్యాన్ని, దంభాచారాన్ని బయటపెడుతున్నాను. ధర్మభావన హిందూమతానికి విశిష్టమైంది. భాగవద్గీతనూ, దాని వ్యాఖ్యానాలను అధ్యయనo చేసిన అదృష్టవంతులు మాత్రమే ఈ గోప్పదేశo అనుసరించి పోషించిన గొప్ప తాత్వికతను అర్ధం చేసుకోగలరు'. - చో రామస్వామి, తుగ్లక్ పత్రిక (సంపాదకుడు)