'చీకటి తర్వాత వెలుగురాక తప్ప''దని చెప్పే సినీ చిత్ర కథ చిత్రాతి చిత్రమైన మలుపులు. జేమ్స్బాండ్ ఒడుపులు...వీరమరణం పొందాడనుకున్న కెప్టెన్ రవి నర్స్ సుశీలను వెంటబెట్టుకుని ఇంటికి వస్తాడు. వేడుకగా వివాహ సన్నాహాలు జరుగుతుండగా సుశీల యాక్సిడెంట్లో మృత్యువాత బడుతుంది. పిచ్చివాడిలా తిరుగుతున్న రవికి తరవాత ఎదుటపడుతుంది! తాను ''సుజాత''నంటుంది. దీనబంధువు డాక్టర్ రఘు పూర్వచరిత్ర ఆప్తమిత్రుడు రవి వివాహానికి ఆటంకమౌతుంది. ఆంగ్లో ఇండియన్ లిల్లీని చంకబెట్టుకుని వచ్చిన ''అమెరికా రిటర్ప్డు'' బాబు తండ్రి ఇంటిముందు సత్యాగ్రహం. అంతమంది దేశ భక్తులకు మెప్పు. దేశ విద్రోహులకు ముప్పు! ఆద్యంతం మిమ్ములను ఉత్కంఠతతో చదివించే నవల.