రామాయణములోని సుందరకాండ పారాయణ ఎందుకు ప్రాముఖ్యత వహించినది? ఆస్తిక మహాపురుషులా! యీ ప్రశ్నకు జవాబు చాలా తేలిక, కావ్య జగత్తులోనే శ్రీమద్రామయణం మొదటిది. రామాయణం అన్ని కాండాలకూ కథాసందర్భముగా పేరుంచి ఒక్క దీనికే మహర్షి 'సుందరకాండము' అను నామకరణం చేయడం అద్భుతాశ్చర్యాలు కలిగిస్తుంది. యీ కాండ శ్లోకాలందు ప్రతి అక్షరం మంత్రమే. బ్రహ్మాండపురాణం, దేవీ భాగవతం, ఉమాసంహిత, పరాశరస్మృతి, సీతోపనిషత్తు, రామోపనిషత్, మొదలైన గ్రంథాలన్నీ చదివిన గాని సుందరకాండ అవగతం కాదు. యిక దీని పారాయణ, పితృకార్యాలలో, శివాలయాల్లో, యిలా ప్రతి కార్యానికి సుందరకాండ పారాయణ అత్యంతావశ్యకం, ముఖ్యముగా సంతానము లేనివారు, వివాహము కానివారు, ధనహీనులు, నష్ట రష్ట్ర్దవ్యము, కోర్టు చిక్కులు మొదలుగా గల ప్రతి కార్యానికీ సుందరకాండ పారాయణ అత్యంతావసరం. పేజీలు : 226+50