నీ పుస్తకానికి 'సాకిరేవు కతలు' అని పేరు పెట్టడానికి కారణం చాకలి గురప్ప అనే వ్యక్తి ఉండేవాడు. వయస్సు రీత్యా ఆయన నాకంటే ఎంతో పెద్దవారయినప్పటికి అతనికి నాకు మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఆయనెన్నో జీవితానుభవాలను నాముందుంచేవాడు. అందుకే ఆయన ప్రధాన పాత్రదారుడిగా అన్ని కథలనూ నడిపించి, ఈ పేరు పెట్టాను.
చాకలి వ్యవస్థ అన్నది ఎంతో పూర్వం నుంచే సమాజ అంతర్భాగంగా ఉన్నది అని నా ఉద్దేశం. రామాయణ కాలంలోనే వీరి ప్రస్తావన వస్తుంది. రామాయణాన్ని మలుపు తిప్పిన ప్రాచీన కులం ఇది, 'ఆది నుంచి మాది ఎంతో గొప్ప కులం' అని చెప్పుకుంటున్న వారికి, భారత జాతికి ప్రామాణిక గ్రంథౄలైన రామాయణ, మహాభారతాల్లో చోటు దక్కకపోవటం, చాకలి కులానికున్న ప్రత్యేకతను తెలియజేస్తుంది. - మూరిశెట్టి గోవింద్
పేజీలు : 128