ఈ సమాజ సౌధం ఎన్నోఏళ్ళుగా ఎందరో మేధావులు తమ ఆలోచనలనే ఇటుకలతో నిర్మించారు. ఒక ఆలోచనను ముందుకు తీసుకు వెళ్ళడానికి వారి జీవితాన్నే అంకితం చేశారు. అలాంటి వాళ్ళల్లో కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సమాజసేవకులు, సాహిత్యవేత్తలు, చరిత్రకారులు వేలాదిగా ఉన్నారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ జీవితం మనకు వారందించిన వరప్రసాదం.