ALL CATEGORIES

ఈ విశ్వచేతనావస్థకు ఏకవీర పాత్రని తీసుకొనిపోవటానికే కూచిపూడి నాట్యం వచ్చింది. ఆ దశలో ఏకవీర వీరభూపతిని కౌగలించుకోవటం, స్పర్శానుభవం పొందటం జరిగింది. కూచిపూడి నాట్యవిషయం వేరుపడగల్లోనూ వస్తుంది. దాని లక్ష్యం అక్కడా చెప్పబడింది. ఈ రెంటినీ కలిపిచూచుకోవాలి. వ్యక్తి- విశ్వవ్యక్తిగా ఎలా పరిణామం పొందుతాడో తెలియటానికి. ఇదే రససిద్ధాంతంలో చెప్పబడినది. దానిని చెప్పిన మహాకవి నేటికాలంలో ఒక్క విశ్వనాథే అనటం పునరుక్తి.