డాక్టర్ దాశరథి రంగాచార్య స్వాతంత్ర్య సమరయోధులు, బహుభాషా వేత్త, రచయిత, కవి, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త.
వీరు ప్రసిద్ధ నవలాకారులు. తెలంగాణ జనజీవితాన్ని నవలకు ఎక్కించిన శిల్పి. సంప్రదాయపు పునాదుల మీద వెలసిన అభ్యుదయ స్థూపాలు వీరి నవలలు.
వేదాన్ని ప్రజాయత్తం చేయాలని దీక్షబూనారు.
నాలుగు వేదాలను ఉపనిషత్తులను, ఋగ్వేద బ్రహ్మాణాలను సాధారణులకు అర్థమయ్యే విధంగా తేట వచనంలో అనువదించారు.
ప్రస్తుత గ్రంథం బుగ్వేద పరిచయం