ALL CATEGORIES

అష్టాదశ పురాణాలలో చివరిదిగా చెప్పబడింది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మ సృష్టికి సంబంధించిన ఎన్నో విశేషాలని ఈ పురాణం వివరిస్తుంది. 'బ్రహ్మాండ మస్తిగీయతే' అన్నమాట ప్రకారం శ్రీమహావిష్ణువు ఎముకలతో ఈ పురాణాన్ని పోల్చబడిందని తెలుస్తోంది. అలాగే 'బ్రహ్మాండం ద్వాదశైవతు'' అన్న వాక్యాన్ని అనుసరించి ఈ పురాణంలో మొత్తం పన్నెండువేల శ్లోకాలున్నాయి. ఇది నాలుగు పాదాలుగా విభజించబడింది. 1.ప్రక్రియా పాదం 2.ఆనుషంగ పాదం 3.ఉపోద్ఘాతపాదం 4.ఉపసంహారపాదం అని.