అష్టాదశ పురాణాలలో రెండవది పద్మ పురాణం. ''హృదయం పద్మ సంజ్ఞతమ్'' అన్న మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు హృదయంతో ఈ పురాణం పోల్చబడింది. పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువు నాభికమలం నుంచి మొదలైన సృష్టిని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ పురాణం కాబట్టి దీనికి పద్మపురాణం అనే పేరు వచ్చింది. ''పాద్మం పంచపంచాశత్సహస్రాణీహ పఠ్యతే'' అన్న వచనం ప్రకారం ఈ పురాణంలో మొత్తం 55 వేల శ్లోకాలున్నాయి.