ALL CATEGORIES

     అష్టాదశ పురాణాలలో మూడోది శ్రీవిష్ణుపురాణం. 'వైష్ణవం దక్షిణతో బాహు:' అన్న వచనం ప్రకారం శ్రీమహావిష్ణువు బాహువుగా ఈ పురాణం చెప్పబడింది. 'త్రయోవింశతి సాహస్రం త్వ్రమాణం' అన్న మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం 23 వేల శ్లోకాలున్నాయి. ఆరు అంశాలుగా విభాగించబడిన ఈ పురాణంలో మొత్తం 126 అధ్యాయాలున్నాయి.