ఈ "శ్రీదేవీ భాగవతం" నిత్య పారాయణం చేయ సంకల్పించిన భక్తజనులకు "శ్రీదేవీ" కరుణ సర్వదా లభించుగాక!
వ్యాస భగవానుల తన సుదీర్ఘ జీవిత ఆధ్యాత్మిక యాత్రలోని "మధుర సుధాకథనం" శ్రీదేవీ భాగవతం. "కవ్యాంతే నాటకం రమ్యం" అంటారు పెద్దలు. అలాగే ఆధ్యాత్మికతకు పరాకాష్ట శ్రీదేవీ, ఆమె భాగవత చరిత్ర. ఇదొక్కసారి స్మరించినవారు శ్రీదేవి లీలావిలాసానికి సర్వత్రా శరణాగతులవుతారు. ఇటువంటి శ్రీదేవి భాగవతాన్ని వేదవ్యాసులు నారదుని ఆశ్వాసంతో ప్రారంభించి, రచించి, భక్తజనుల కందిస్తారు. శ్రీ వేదవ్యాసానికి ఎన్నో అనువాదాలు, టీకా తాత్పర్యాలు, వివరణ వ్యాఖ్యలు ఎన్నో... ఎన్నెన్నో... అన్ని బాషలలోను వచ్చాయి.
కనుక ఈ దివ్య చరిత్ర పఠనం సర్వభక్త జనులకు ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదించి ఇష్టకామ్యార్థ సిద్దితో పాటు ఆ పరాత్పరి శాశ్వత పదసన్నిధి లభింపచేయ గలదని... ఆశిస్తున్నాను.
- వోరుగంటి రామకృష్ణప్రసాద్