ఆధ్యాత్మిక భారతీయుల రక్తంలో ప్రవహించే అమృతఝురి. దైవమునందు పరిపూర్ణ విశ్వాసమే వారి జీవన మనుగడకు మూలము వేదములు, పురాణములు, ధర్మశాస్త్రములు, కావ్యాది గ్రంథములు దేవతాతత్త్వమును పలు విధములుగా తెలియజెప్పుచున్నవి. వీటి సారము భక్తి జ్ఞాన కర్మ మార్గముల ద్వారా భగవంతుని ఆరాధించి తరించుటయే!
గృహస్థాశ్రమంలో వేదవేదాంగములు దెల్పిన విధముగా భగవదారాధన మొనర్చుట చాలా క్లిష్టతరము. అందువలన సర్వులు భక్తి ప్రధానంగా సర్వకాలములందు భగవన్నామమును స్మరించుటకు మరియు సహజ సిద్ధమగు కోరికలు వెంటవెంటనే సఫలీకృతమగుటకు వీలుగా బీజాక్షరములతో సంపుటితమైన కొన్ని ముఖ్యమైన స్తోత్రములను ఇందు పొందు పరుచుట జరిగినది. దీనిని సంకలన మొనర్చిన శ్రీ యమ్ సత్యనారాయణ సిద్ధాంతి గారు అభిలాష ఆసక్తి గల భక్తులందరూ దీనిని ముద్రించుకొని సర్వజనోపయోగము గావించుట కనుమతించి యున్నారు.