సకల ధర్మ, నీతి, శాస్త్రమైన మహాభారతంలోని మహాద్భుత ఘట్టం విదురనీతి.
దీనిని దృతరాష్ట్రుడు నిదుర పట్టడం లేదు,నాలుగు మంచి మాటలు చెప్పమంటే - ప్రభూ మీకేమయింది. ఎందుకీ దీనాలాపం , విలాపం? అంటూ మాండవ్యముని శాపంతో వ్యాస సంపర్కంతో , శూద్రయోనిలో జన్మించవలసిన యమ ధర్మరాజు కృష్ణ ద్వేపాయనులవారి కరుణా విలాసంగా జన్మించిన -విదుర మహాశయుల సద్దార్మ స్వరూపం విదురనీతి. అంతేకాదు పుష్కర జలాలలో మునిగిన ప్రవిత్రత, వేదవిదులను పూజించిన ఫలితం తోపాటు విన్నందు వలన వచ్చే ఫలం చెప్పనలవికానిదన్నది పెద్దల ప్రకటన.