ALL CATEGORIES

శ్రీ మద్రామానుజుల విశిష్టాద్వైత ప్రస్థానం దక్షిణ భారతదేశంలో అసంఖ్యాక దేవాలయాల ఆవిర్భావానికి కారణమయింది. ఆ రామానుజయతీంద్రుల అపారకృప హేమసుందరీ రంగనాయకుల వంటి వారినెందరినో మహనీయ మానవ స్వర్ణ దేవాలయాలుగా మలిచింది. ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను దోచుకొని, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమానాన్నందుకున్న కమనీయ నవల ‘విశాల నేత్రాలు’.