అధికారం కోసం, భూమికోసం, చదువుకోసం జరిగిన పోరాటాల చరిత్ర భారతదేశ పురాణ సాహిత్యం నిండా కనిపిస్తుంది.
'మతం ప్రజలను పాలించేది' అన్నారు తిలక్. మతాన్ని ఒక రాజకీయ వ్యవస్థగా ఆయన చూశారు.
సమాజాన్ని వర్గాలుగా విడగొట్టి అందులో కొన్ని వర్గాలను ఆధిపత్య కులాలుగా, కొన్ని వర్గాలను సేవక కులాలుగా స్థిరపరిచే ప్రయత్నంలో మనుధర్మ శాస్త్రానికి లక్ష్యంగా రామాయణ రచన జరిగింది. 'మూర్తీభవించిన ధర్మం రాముడు' అంటున్నది రామాయణం.
సంప్రదాయం పేరిట, ధర్మం పేరిట ఎలాంటి వ్యవస్థను రామాయణం ప్రచారం చేసిందో ఈ పరిశీలనలో గమనించవచ్చు.