దాశరథి మహాకవి, కథకుడు, నాటకకర్త, అనువాదకులు, వ్యాస రచయిత. వారు కేంద్ర, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీల బహుమతులు అందుకున్నారు. ఆంధ్ర, ఆగ్రా, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయాలు వారికి డాక్టరేట్ల ప్రదానం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి పదవిని అధిష్టించారు. డాక్టర్ దాశరథి స్వాతంత్య్ర సమరయోధుడు. నిజామాబాదు జైల్లో ఉండి ”మా నిజాం రాజు జన్మజన్మాల బూజు” అని గర్జించాడు.